బెదిరిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ !
మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో అభిమాని ఒక్కసారిగా కాళ్లు మొక్కేందుకు దూసుకురావడంతో కంగారుపడిన ఘటన వైరల్ అయింది.
విధాత : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం దీదీ మమతా బెనర్జీ ప్రచార పర్వంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకపడే మమత ఓ అభిమాని చర్యకు బెదిరిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపు ల ఉన్న ప్రజలకు, అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తూ మమత ముందుకు సాగుతున్నారు. అయితే అనూహ్యంగా ఓ యువకుడు పోలీసు వలయాన్ని దాటుకుని మమత కాళ్లు మొక్కేందుకు ముందుకు దూసుకొచ్చాడు. అనుకోని ఈ ఘటనతో కంగారుపడ్డ మమత కంగారుకు గురై కొద్దిసేపు బిత్తర పోయి అలాగే నిలుచుండి పోయారు.
పోలీసులు వెంటను ఆ యువకుడిని పట్టుకుని తిరిగి పోలీసు వలయం బయటకు తరలించారు. యువకుడి తనపై దాడికి వస్తున్నాడేమో అన్న అనుమానంతో భయపడిపోయిన మమతా బెనర్జీ ఆ తర్వాతా అతడి అభిమానాన్ని అర్ధం చేసుకుని అభివాదం చేసి ప్రచార కార్యక్రమంలో ముందుకు సాగిపోయారు. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ మమత బందోబస్తును మరింత పటిష్టం చేశారు.
కాళ్ళకు మొక్కడానికి వస్తే కంగారు పడ్డ మమత.
ఎన్నికల ప్రచారం లో భాగంగా నడుస్తున్న సమయం లో అకస్మాత్తుగా యువకుడు ముందుకు రావడంతో బిత్తర పోయిన మమతా బెనర్జీ.#mamatabenarjee #WestBengal #UANow pic.twitter.com/lUBl3AAdWG
— UttarandhraNow (@UttarandhraNow) April 17, 2026
ఇవి కూడా చదవండి :
రాహుల్ గాంధీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram