దేశమంతా సార్వత్రిక ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుండగా, ఉత్తర ప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ఆ జోష్..సదండి కరువైంది. పార్టీల ఎన్నికల ప్రచారం వేగం పుంజుకోకపోవడంతో
చప్పగా సాగుతున్న అధికార, విపక్షాల ప్రచారం
విధాత, లక్నో : దేశమంతా సార్వత్రిక ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుండగా, ఉత్తర ప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ఆ జోష్..సదండి కరువైంది. పార్టీల ఎన్నికల ప్రచారం వేగం పుంజుకోకపోవడంతో నత్తనడకన సాగుతున్న ప్రచారం అటు పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఓటర్లను సైతం తికమక పెడుతుంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో ఎనిమిది పార్లమెంట్ నియోజక వర్గాలున్నాయి. ఏఫ్రిల్ 19 న అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయినా ఈ రోజుకు ఇంకా ఎన్నికల ప్రచార సరళిలో ఊపందుకోలేదు. ఈ ఎన్నికలు అంతా చప్ప చప్ప గా వున్నట్లు ఓటర్లు, కార్యకర్తలు వాపోతున్నారు. మీరట్ , ముజఫర్ నగర్, బిజ్నోర్ తదితర జిల్లాల్లోని పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు మీదొచ్చి పడ్డా పార్టీల నిద్ర మత్తు వదిలినట్టు లేదని ఓటర్లే తిట్టిపోసుకుంటున్నారు.
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార రణరంగంలో ఒక ప్రముఖ ప్రత్యేకత స్థానం కలిగి వుందన్నారు. ఇక్కడ జరిగే ప్రచార ప్రభావం మొత్తం రాష్ట్రం అంతటా పడే అవకాశం మెండుగా వుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ఎన్నికల అపభావం అలాంటి ప్రభావం చూపింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు మరోక ఎన్నికల ప్రత్యేక కోణం కూడా వుంది. ఢిల్లీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడ జరిగే ఎన్నికల ప్రచారం ఢిల్లీ పైనా..అటు నుంచి సమీప రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకొన్న ఈ ప్రాంత ఎన్నికల ప్రచారం ఈ సారి మాత్రం ఎందుకో మరి నీరసంగా కొనసాగుతున్నది, అక్కడక్కడ ఎన్నికల ప్రచార బ్యానర్, పోస్టర్లు ,హోర్డింగ్ లు కనబడుతున్నాయి. ఎక్కడా జై శ్రీరాం నినాదాలు బ్యానర్లల్లో, పోస్టర్లల్లో, వీధుల్లల్లో బీజేపీ కార్యకర్తలు వాల్ రైటింగ్ సైతం కనిపించడం లేదు. గత రెండు ఎన్నికల్లో ఈ ప్రాంతం ఒక పెద్ద ఎన్నికల కురు క్షేత్రంగా నిలిచింది. భారత్ – పాక్ క్రికెట్ మ్యాచ్ ల మద్య వుండే ఉద్రిక్త వాతావరణం, ఇండియా- పాక్ ల సరిహద్దుల్లోవుండే కోపోద్రిక్తతలు ఇక్కడ అధికార, ప్రతిపక్షాల ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమవుతుండేవి. అటువంటి హంగామా ఈ దఫా ఎన్నికల ప్రచారంలో కనిపించక పోయేసరికి ప్రజల్లో, ఇటు ఓటర్లల్లో అనేక చర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ గత పదేండ్ల నుండి అధికారంలో వుంది. అయినా ఆ పార్టీ ప్రచార జోరు ఊపందుకోవడం లేదు. పట్టీ పట్టని ప్రచారం అంతంత మాత్రంగా సాగుతోంది.
అధికార పార్టీ బీజేపీ ప్రచారమే ఇలా వుంటే ఇక ప్రతిపక్ష పార్టీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. వాటి ఊసే ప్రజల్లో కనిపించడం లేదు. ఓటర్ల మనస్సులో ఎన్నికల వాతావరణ జోష్ వ్యక్తమవ్వడం లేదు. అసలు వాస్తవంగా గట్టి ఐక్యతతో బరిలోకి దిగి అధికారం బీజేపీని ఓడించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాల్సిన ప్రతిపక్షాలలో ఆ స్థాయి సామర్ధ్యం..ఉత్సాహం కొరవడింది. పరిస్థితికి దగ్గ వ్యూహం- ప్రతి వ్యూహాలు, ఎత్తులకు- పైఎత్తులు ప్రతిపక్షాల్లో లేవంటున్నారు. సోషల్ మీడియాలో సైతం పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్లో కానరాని ఎన్నికల సందడి..ప్రతిపక్షాల బలహీన ప్రచార కార్యక్రమాలపై సెటైర్లు సాగుతున్నాయి.