విధాత,: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా తేయాకు తోటల్లో ప్రత్యక్షమై అక్కడి మహిళా కార్మికులను ఆశ్చర్యపరిచారు. బుధవారం దిబ్రూగఢ్లోని ఓ తేయాకు తోటను సందర్శించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో ప్రధాని మోదీ ముచ్చటించారు. తేయాకు సేకరణ విధానాన్ని పరిశీలించారు. తేయాకు సేకరణ, రవాణ, విక్రయాల వివరాలను తెలుసుకున్నారు. వారితో కలిసి అస్సాం సాంప్రదాయ నృత్యంలో సందడి చేశారు.
తేయాకు తోట సందర్శన..అస్సాం మహిళలతో ముచ్చట..వారి స్వాగత నృత్యాలపై స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని తెలిచేశారు. ఇది ఒక అత్యంత మధురమైన అనుభవం అని పేర్కొన్నారు. తేనీరు అస్సాం ఆత్మ!..అని, ఇక్కడి తేనీరు ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని సంపాదించుకుందని ప్రశంసించారు. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఇలాంటి స్టంట్లు అలవాటేనంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేశాయి.
আজি পুৱা ডিব্ৰুগড়ৰ এখন চাহ বাগিচাত, চাহ বাগিচাৰ পৰিয়ালসমূহৰ সংস্কৃতিৰ আভাস পালো। অসমৰ প্ৰগতিৰ ক্ষেত্ৰত তেওঁলোকৰ অৱদান অতুলনীয়। ইয়াৰ কিছু বিশেষ মুহূৰ্ত… pic.twitter.com/bZnK4560cl
— Narendra Modi (@narendramodi) April 1, 2026
ఇవి కూడా చదవండి :
Varanasi Ganga Ghat | గంగా ఘాట్ లో పూజారి దుర్మార్గం..దేహశుద్ది
Commercial Gas | భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు..!
