తమిళనాడులో ప్రభుత్వ బస్సుకు ఏర్పడిన రంధ్రం నుంచి ఓ మహిళా ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు పడిపోయింది
విధాత: తమిళనాడులో ప్రభుత్వ బస్సుకు ఏర్పడిన రంధ్రం నుంచి ఓ మహిళా ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు పడిపోయింది. బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ దారుణ ఘటన చెన్నైలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే..
சென்னை திருவேற்காட்டில் இருந்து, வள்ளலார் நகர் செல்லும் தடம் எண் 59 பேருந்தில், இருக்கையில் அமர்ந்திருந்த சகோதரி ஒருவர், இருக்கையின் கீழ் இருந்த பலகை உடைந்து, ஓடிக்கொண்டிருந்த பேருந்தில் இருந்து கீழே விழுந்து, அதிர்ஷ்டவசமாக உயிர் தப்பியுள்ளார். தமிழகத்தில் திமுக அரசு நிர்வாகம்… pic.twitter.com/pRgmqyZzEY
— K.Annamalai (@annamalai_k) February 6, 2024
చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) బస్సులో వల్లలార్ నగర్-తిరువెర్కాడు మధ్య ప్రయాణిస్తున్న ఓ మహిళ సీటు నంబర్ 59లో కూర్చుంది. తన స్టేజీ రాగానే ఆమె సీటు నుంచి లేచి ముందుకు నడుస్తుండగా, బస్సు ఫ్లోర్పై ఏర్పడిన రంధ్రం నుంచి ఒక్కసారిగా జారి రోడ్డుపై పడిపోయింది. ప్రయాణికులు గట్టిగా అరవడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఆమె టైర్ల దగ్గర ఆగిపోయింది. కాస్త లేటయితే టైర్లు ఆమె పైనుంచి పోయేవి. ఆమెకు చిన్నపాటి గీతలు తగిలాయి. స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం అమింజికరై సమీపంలో జరిగింది.
బస్సు ఘటనను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై X (గతంలో ట్విట్టర్) పోస్టుచేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.