విధాత, హైదరాబాద్ : సీఎంల నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీల సీఎంలు బహిష్కరించడం సరికాదని, ఏవైనా విభేదాలు ఉంటే.. తన అభిప్రాయాన్ని నీతి అయోగ్ సమావేశానికి హాజరై తెలపాలని కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి సూచించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మమతా బెనర్జి సహా విపక్ష పార్టీల సీఎంలు నీతి అయోగ్ ను బహిష్కరించి, ఆ సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఖండిస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో నీతి అయోగ్ కీలకమైందని, అటువంటి సమావేశంలో సీఎంలు పాల్గొని తమ అభిప్రాయలు వినిపించాలన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ దిశగా అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పేదల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఈ బడ్జెట్లో పేదల అభ్యుదయానికి పెద్దపేట వేశామని తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత స్కీం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఉత్పాదకత, వ్యవసాయం, యువతకు ఉపాధి వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. గతంలో తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయలేదని, ఈ ఏడాది 5 వేల కోట్ల రూపాయలకు పైగా రైల్వే బడ్జెట్ తెలంగాణకు కేటాయించామన్నారు. 48 వేల కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణాలో చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లు విస్తరణ చేస్తామని, రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ఓపెన్ చేశామన్నారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన లెక్కలపై తప్పుడు లెక్కలు చెబితే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించిన సంగతి మరవరాదన్నారు.
NITI AAYOG | నీతి అయోగ్ బహిష్కరణ సరికాదు … కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
సీఎంల నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రతిపక్ష పార్టీల సీఎంలు బహిష్కరించడం సరికాదని, ఏవైనా విభేదాలు ఉంటే.. తన అభిప్రాయాన్ని నీతి అయోగ్ సమావేశానికి హాజరై తెలపాలని కేంద్ర మంత్రి పహ్లాద్ జోషి సూచించారు

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత