విధాత: మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో యువ మహిళా పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ కూడా ఉండటంతో ఆమె వివరాలను నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. బుధవారం అజిత్ పవార్ ప్రయాణించిన లియర్జెట్-45 విమానంలో పైలట్ ఇన్ కమాండ్గా కెప్టెన్ సుమిత్ కపూర్ వ్యవహరించగా.. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్గా పనిచేశారు. కెప్టెన్ సుమిత్కు 16,500 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం రెండుసార్లు ప్రయత్నించగా.. చివరకు విమానం ఓ బండరాయికి గుద్దుకుని మంటలు చెలరేగి ముక్కలుగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 5 మంది అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకురాలు పింకీ మాలి, సెక్యూరిటీ ఆఫీసర్ విదిప్ జాదవ్, ఇద్దరు పైలట్లు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రతిభావంతురాలు శంభావి పాఠక్
శాంభవి పాఠక్ ఎయిర్ఫోర్స్ బాలభారతి స్కూల్లో చదువుకున్నారు. 2016-18 మధ్య సెకండరీ విద్యను పూర్తిచేసుకున్న శాంభవి ముంబయి యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. చిన్న వయసులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందిన ఆమె.. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకుని లైసెన్స్ పొందారు. ఆ తర్వాత భారత్కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్తో పాటు ఫ్రోజెన్ ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గానూ పనిచేశారు. 2022 ఆగస్టు నుంచి వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫుల్ టైమ్ ఫస్ట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్జెట్-45 లాంటి విమానాలను నడుపుతున్నారు. ప్రమాదంలో కూలిన అజిత్ పవార్ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా కొనసాగుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి :
Ajit Pawar : అజిత్ పవార్ ఆఖరి పోస్టు వైరల్ !
Allu Arjun | షూటింగ్కు ముందే రికార్డులు… అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో సెన్సేషన్
