ఈ లోక్సభ ఎన్నికలు మలుపు తిరిగిన మాట వాస్తవమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ అన్నారు
ఈ లోక్సభ ఎన్నికలు మలుపు తిరిగిన మాట వాస్తవమని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. తాను కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్,హర్యానా వెళ్లానని చెప్పారు. ఎన్నికలపై పదేహేళ్ల నా అనుభవంతో చెబుతున్నాను. బీజేపీకి మెజారిటీ రాదని చెప్పారు. ఆ పార్టీకి మెజారిటీకి అవసరమైన సీట్లు కూడా రావని, ఎన్డీఏ కూటమికి కూడా 270 సీట్ల కంటే తక్కువే వస్తాయని అంచనా వేశారు.
2019లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యపార్టీలకు 353 సీట్లు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 10 సీట్లు, మహారాష్ట్రలో 20, రాజస్థాన్+ గుజరాత్లలో 10, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీలలో కనీసం 10, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్లలో 10, ఉత్తర్ప్రదేశ్+ ఉత్తరాఖండ్లలో 15, బీహార్లో 15, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో 10 ఇలా బీజేపీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలు 100 సీట్ల వరకు కోల్పోతున్నాయి. మరోవైపు తమిళనాడు, కేరళ, తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కలిపి 5 సీట్లు, ఏపీలో 10 ఎన్డీఏకు సీట్లు వస్తాయని. ఇది ఎగ్జిట్పోల్స్ కావని ఇప్పుడు పరిస్థితి ప్రకారం బీజేపీకి సొంతంగా 233 వరకు, ఎన్డీఏ కూటమితో కలిపి 268 సీట్లు రావొచ్చు అని ఆయన అంచనా వేశారు.