సిఎం జగన్మోహన్రెడ్డికి నారా లోకేష్ లేఖ
విధాత: మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేయాలని లేనిపక్షంలో వాయిదా వేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సిఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు.
లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.
మూడ వారాల ఆందోళన, న్యాయ పోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయాలని/లేదంటే రద్దు చేయాలని కోరుతున్నాను. వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు రాష్ట్రంలో జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో కరోనా ఉధృతమైన పరిస్థితుల్లో రోజు వారీ కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటటంలేదు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో అనేక మంది చనిపోతున్న ఘటనలు మీకు తెలియనివి కాదు. మే 2021 లో జరగాల్సిన ఆఫ్లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మే లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నా
జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలి.