37 కోట్ల మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ
97.20 శాతానికి రికవరీ రేటు
విధాత,దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు,మరణాలు తగ్గినట్టే తగ్గి..పెరుగుతున్నాయి.తాజాగా 42,766 మందికి కరోనా సోకింది. క్రితంరోజు కంటే కేసులు కొద్దిమేర తగ్గాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరిగాయి. తాజాగా 1,206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,07,95,716కి చేరగా.. 4,07,145 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 19,55,225 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.48 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 30,55,802 మంది టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 37కోట్ల మార్కును దాటింది.