" /> " /> " />
శివాజీ విగ్రహానికి ప్రభుత్వ నిధులకు తాను వ్యతిరేకమన్న గడ్కరీ న్యూఢిల్లీ: నాగ్పూర్లో శివాజీ విగ్రహానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) అన్నారు. "ప్రజలు ఉచితంగా ఇచ్చే వస్తువులకు విలువ ఇవ్వరు" అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం (RTMNU)లో ఆదివారం జరిగిన శివాజీ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ఈ విగ్రహానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక్ సమితి […]
న్యూఢిల్లీ: నాగ్పూర్లో శివాజీ విగ్రహానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) అన్నారు. “ప్రజలు ఉచితంగా ఇచ్చే వస్తువులకు విలువ ఇవ్వరు” అని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం (RTMNU)లో ఆదివారం జరిగిన శివాజీ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. ఈ విగ్రహానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక్ సమితి అనే సంస్థ నిధులు సమకూరుస్తోంది.
“ప్రజల సహకారంతో విగ్రహాన్ని నిర్మిస్తున్న కమిటీ చర్యను నేను స్వాగతిస్తున్నాను. విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రభుత్వ నిధులు వినియోగించకూడదని భావిస్తున్నాను. ఉచితంగా ఇచ్చే వస్తువులకు ప్రజలు విలువ ఇవ్వరు’’ అని గడ్కరీ స్పష్టం చేశారు. “నాగ్పూర్ మునిసిపల్ కార్పొరేషన్, నాగ్పూర్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం లేదా RTMNU నుండి ఈ విగ్రహ ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోరవలసిన అవసరం లేదు” అని చెప్పారు.
జూన్ 17 నాగ్పూర్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్రమంత్రి గడ్కరీ కొత్తగా ఏర్పాటైన కర్ణాటక ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను సవరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. “డాక్టర్ హెడ్గేవార్, స్వతంత్ర వీర్ సావర్కర్ల అధ్యాయాలను పాఠశాల సిలబస్ నుండి తొలగించడం దురదృష్టకరం. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి లేదు, ”అని గడ్కరీ పేర్కొన్నారు.
2019లో కర్ణాటకలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాల్లో మార్పులను సవరించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 17న నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన మొత్తం 18 పాఠాల మార్పులలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కె.బి రాసిన పాఠాన్ని కూడా తొలగించాలని నిర్ణయించింది.