IPL 2024 RR vs KKR రాజస్థాన్​ బ్యాడ్​లక్​ – వర్షం కారణంగా రెండో స్థానానికి సన్​రైజర్స్​​

రాజస్థాన్ ప్లేఆఫ్స్​లో రెండోస్థానానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఆఖరి లీగ్​ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. కోల్​కతా–రాజస్థాన్​ (KKR vs RR) మధ్య జరగాల్సిన పోరును వరుణుడు తుడిచిపెట్టడం(Rain washed out)తో రాజస్థాన్​కు షాక్​ తగిలింది.  

  • By: Tech    sports    May 19, 2024 11:35 PM IST
IPL 2024  RR vs KKR రాజస్థాన్​ బ్యాడ్​లక్​ – వర్షం కారణంగా రెండో స్థానానికి సన్​రైజర్స్​​

ఐపిఎల్​ 2024(IPL 2024)లో భాగంగా గువాహటీ(Guwahati) ​లో రాజస్థాన్​ రాయల్స్​​, కోల్​కతా నైట్​రైడర్​​ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి లీగ్​ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్​ కేటాయించారు. ఇది కోల్​కతాకేం నష్టం కలిగించకపోగా, రాజస్థాన్​కు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్​లో గెలిచి రెండో స్థానంలో సెటిల్​ అవుదామనుకున్న ఆరార్​(Rajasthan Royals) మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఒకసారి వర్షం ఆగిపోయి,  మ్యాచ్​ను 7 ఓవర్లకు కుదించారు. టాస్​ గెలిచిన కోల్​కతా ఫీల్డింగ్​ ఎంచుకుంది. ఈ దశలో మళ్లీ కురిసిన వర్షం పూర్తిగా మ్యాచ్​ను తుడిచిపెట్టింది.  అదనంగా వచ్చిన ఒక్క పాయింట్​తో రాజస్థాన్​ కూడా, ఇంతకుముందే పంజాబ్​తో మ్యాచ్​ గెలిచి 17 పాయింట్లు సాధించిన సన్​రైజర్స్​తో సమానంగా 17 పాయింట్లు గెల్చుకుంది. రెండు జట్లు సమాన పాయింట్లతో ఉన్నప్పుడు నెట్ రన్​రేట్​ ఆధారంగా ముందడుగు పడుతుంది. ఆవిధంగా రాజస్థాన్(+0.273)​ కంటే మెరుగైన రన్​రేట్​ ఉన్న హైదరాబాద్​ (+0.414))రెండో స్థానంలోకి అడుగుపెట్టింది.

మొత్తానికి ప్లేఆఫ్స్​ స్థానాలు( Play 0ffs positions confirmed) ఖరారయ్యాయి. మొదటి స్థానంలో కోల్​కతా, రెండో స్థానంలో హైదరాబాద్​, మూడో స్థానంలో రాజస్థాన్​, ఆఖరి స్థానంలో సంచలన రీతిలో ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టిన బెంగళూరు ఉన్నాయి.

కాగా, ప్లేఆఫ్స్​ మ్యాచ్​ షెడ్యూలు ఈ విధంగా ఉంది.

క్వాలిఫయర్​ –1 (నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్): మే 21, 2024

మే 21న అహ్మదాబాద్​ నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫయర్​ 1 మ్యాచ్​ నిర్వహిస్తారు. ఇందులో 1వ, 2వ స్థానాల్లో ఉన్న కోల్​కతా, హైదరాబాద్​ తలపడతాయి. ఇందులో విజేత నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిపోయినవారు, ఎలినేటర్​ మ్యాచ్​లో గెలిచినవారితో క్వాలిఫయర్​2లో ఆడతారు.

ఎలిమినేటర్​​  (నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్): మే 22, 2024

మే 22న అహ్మదాబాద్​ నరేంద్రమోదీ స్టేడియంలో ఎలిమినేటర్​ మ్యాచ్​ జరుగనుంది. ఇందులో 3వ, 4వ స్థానాల్లో ఉన్న రాజస్థాన్​, బెంగళూరు జట్లు పోరాడతాయి. గెలిచినవారు క్వాలిఫయర్​1లో ఓడిపోయినవారితో క్వాలిఫయర్​2లో తలపడతారు. ఓడినవారు ఇంటిముఖం పడతారు.

క్వాలిఫయర్​ –2 (ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై): మే 24, 2024

మే 24న శుక్రవారం రోజున చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్​2 మ్యాచ్​ జరుగుతుంది. ఇందులో క్వాలిఫయర్​ 1లో ఓడినవారు, ఎలిమినేటర్​లో గెలిచినవారు ఆడతారు. గెలిచినవారు ఫైనల్లో క్వాలిఫయర్​1 విజేతతో ఢీ కొడతారు.

ఫైనల్​ మ్యాచ్​ (ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై): మే 26, 2024

మే 26, ఆదివారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్​ మ్యాచ్​ జరుగనుంది. ఈ మ్యాచ్​ ఐపిఎల్​ 2024 విజేతను నిర్ణయించనుంది. దీంతో ఈ సీజన్​ (2024) ఘనంగా ముగుస్తుంది.