పాన్మక్తలో ఎకరం రూ.101కోట్లు..వేలానికి సర్కార్ నోటిఫికేషన్

పాన్మక్తలో ఎకరం రూ.101 కోట్లకు ప్రభుత్వ భూములను వేలం వేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాయదుర్గ ఫాన్‌మక్తలో 18.67 ఎకరాలను వేలం వేయనున్నారు.

పాన్మక్తలో ఎకరం రూ.101కోట్లు..వేలానికి సర్కార్ నోటిఫికేషన్

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మరోసారి భూముల అమ్మకానికి సిద్దమైంది. శేరిలింగంపల్లి(Serilingampally) మండలం రాయదుర్గ ఫాన్మక్త గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 83/1లోని మొత్తం 18.67 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది.

ఈ భూమిని ఎకరాకు రూ.101 కోట్ల చొప్పున విక్రయించనున్నట్లుగా టీజీఐఐసీ (ఈ-వేలం ప్రకటన) పేర్కొంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయాంలో మాదాపూర్ పరిధిలోని విలువైన భూములను అమ్మగా..రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మిగిలిన ప్రభుత్వ భూముల అమ్మకాలకు సిద్దపడటం గమనార్హం.