నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాజీ లవర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం సప్త సాగర దాచే ఎల్లో. ఈ చిత్రం తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదలైంది. సెప్టెంబరు 22న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సాధారణంగా ఎంతటి ఫ్లాప్ చిత్రం అయిన మూవీ రిలీజ్ అయిన నెల రోజులకి గాను ఓటీటీలో విడుదల కాదు. కాని ఇప్పుడు సప్తసాగరాలు దాటి చిత్రం హిట్ అయినప్పటికీ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది.
కన్నడ సినిమాను సప్తసాగరాలు దాటి పేరుతో అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోకి డబ్ చేయగా, ఈ సినిమాకు హేమంత్ ఎమ్ రావు దర్శకత్వం వహించాడు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్స్టోరీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ముందుగా చిత్రాన్ని కన్నడంలో సెప్టెంబర్ 1న రిలీజ్ చేయగా, అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్, మ్యూజిక్పై ప్రశంసలు కురిపించారు.
చిత్ర కథ విషయానికి వస్తే మూవీలో కారు డ్రైవర్గా పనిచేసే మను, ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతారు. వారిద్దరు కలిసి పెళ్లి చేసుకువాలనుకుంటారు. సొంత ఇళ్లు కట్టుకోవాలనేది కూడా వారి కల కాగా, దానిని నెరవేర్చుకునేందుకు నేరం చేయకపోయిన కూడా దానిని తనపై వేసుకుంటాడు మను. ఆ నేరం వేసుకున్న తర్వాత మను జీవితంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనేది చిత్రంలో ఆసక్తిగా చూపించారు. చిత్రాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్గా రూపొందించారు. ఈ సినిమాని రెండు పార్ట్లుగా దర్శకుడు విడుదల చేయబోతుండగా, పార్ట్ వన్ను సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏగా రిలీజ్ చేశారు. సీక్వెల్ సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీగా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.