జగన్ పాలన వైసీపీ నేతలకే నచ్చట్లేదు.. ట్విట్టర్ లోనారా లోకేష్
విధాత: జనం కాదు జగన్రెడ్డీ.. నీ చేతగాని పాలనని వైసీపీ ఎంపీలే ఎండగడుతున్నారు. కరోనా కట్టడికి ఏం చేయలేని నీ పనికిమాలిన పాలనని దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశామని, ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే..సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇదిగో ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు. కరోనా నియంత్రణకి […]

విధాత: జనం కాదు జగన్రెడ్డీ.. నీ చేతగాని పాలనని వైసీపీ ఎంపీలే ఎండగడుతున్నారు. కరోనా కట్టడికి ఏం చేయలేని నీ పనికిమాలిన పాలనని దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశామని, ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే..సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు.

ఇదిగో ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు. కరోనా నియంత్రణకి జగనేం చేశాడు..బొక్క చేశాడు
అంటూ పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ గారు.
ప్రభుత్వం లాజిస్టిక్స్ మెయింటెన్ చేయడంలేదు..జగన్ చేతులెత్తేశాడు
అని మీ ఆకుల ఆగ్రహంగా ఉన్నారు.శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలే వాపోతున్నారు.నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచీలను ఫేక్ ట్వీటులతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని.