Site icon vidhaatha

ఆది శంకరాచార్యుల సమాధి పునః ప్రతిష్టించడం గొప్ప విషయం

విధాత‌: రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరం.కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి వరద బీభత్సంలో దెబ్బతిన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ధ్రుఢ సంకల్పంతో పునః ప్రతిష్టించడం గొప్ప విషయమ‌న్నారు బండి సంజయ్.

నరేంద్ర మోదీ ప్రభుత్వం లేకుంటే ఇలాంటి పవిత్ర కార్యం జరిగేదా?అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా?.దీన్ని కూడా మతతత్వ కోణంలో చూస్తే ఇంత కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు.80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా?,కుహానా లౌకిక శక్తుల ఆలోచనల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది.

Exit mobile version