తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకెలుతున్నారన్న ప్రధాని మోదీ ఎందుకు ఆపడం లేదని, అసలు మోదీకి రాహుల్గాంధీకి మధ్యన సీఎం రేవంత్రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్తో మధ్యవర్తిత్వం వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
ఆస్తులపై విచారణకు నేను సిద్దం
కేసీఆర్ను బద్నాం చేసేందుకే విచారణలు..కేసులు
మీట్ ది ప్రెస్లో మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి కీలక వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్: తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి తీసుకెలుతున్నారన్న ప్రధాని మోదీ ఎందుకు ఆపడం లేదని, అసలు మోదీకి రాహుల్గాంధీకి మధ్యన సీఎం రేవంత్రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్తో మధ్యవర్తిత్వం వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ మోదీ, రేవంత్ ఇద్దరూ ఒకటేనని అందుకే తెలంగాణ నుంచి ఢిల్లీకి వెలుతున్న వేలకోట్లపై చర్యలు లేవన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చెత్త వివాదం అని కొట్టిపారేశారు. ట్యాపింగ్ వ్యవహారం కొత్తది కాదని, ఉద్యమ కాలంలో మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఏ భార్య భర్తల ఫోన్ మాటలు వినలేదని, ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై కావాలని కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. బీఆరెస్ను, కేసీఆర్ను బద్నాం చేయాలని, పార్టీని బలహీనం చేయాలని లేని కేసులతో బెదిరించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఒప్పందాలు.. యాదాద్రి థర్మల్ ఫ్లాంట్పై విచారణకు సిద్ధమని తాను గతంలోనే స్పష్టం చేశానన్నారు.
ప్రభుత్వం తనపై రెవెన్యూ యాక్ట్ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. తనకు అక్రమ ఆస్తులు ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. ఏ విచారణకైనా తాను సిద్దం అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పరాన్న జీవి అని విమర్శించారు. పూటకో మాట్లాడే కోమటిరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నా ఆస్తులు, కోమటి రెడ్డి బ్రదర్స్ ఆస్తుల లెక్కలు తీయండని, ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో తెలుస్తుందన్నారు. నాకు ఫోజులు కొట్టడం అలవాటు లేదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిని, జానారెడ్డిని, ఉత్తమ్ను ఓడగొట్టిన అని నేను ఎప్పుడైనా చెప్పలేదన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు ఓటములపై తన వంతు పాత్ర ఉంటుందన్నారు.
జూన్ 4 తర్వాతా 25మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెలుతారన్న మాటలు చెత్త మాటలని వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు అజ్ఞానంతో కూడుకున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి తెలీయకుండా హామీలు ఇవ్వడం మోసమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలతో మోసపోయామని ప్రజలు తొందరగానే గ్రహించారన్నారు. బీఆరెస్ హయాంలో ఓటుకు నోటు కేసుపై ప్రభుత్వ పరిధిలో చేసేవరకు చేశామన్నారు. గడిల పాలన అని కేసీఆర్పై దుష్ప్రచారం చేసిన రేవంత్రెడ్డి ప్రజాపాలన అని చెప్పి రోజుకు ఎంతమంది ప్రజలను కలుస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజావాణి నామమాత్రమైందన్నారు.
రిజర్వేషన్ల కొనసాగింపు మా విధానం
ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ చెప్పడం ఓ వర్గం మనోభావాలు దెబ్బ తీయడమేనని, ఈసీ అలా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్పై చర్యలు తీసుకున్న ఈసీ మోదీ, రేవంత్లపై మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తొలగించడానికి మేం వ్యతిరేకమని ప్రస్తుత రిజర్వేషన్ల విధానం కొనసాగింపునే మా విధానమని తెలిపారు. దేశంలో చట్ట వ్యతిరేక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేత శాన్ పిట్రాడోవి పిచ్చి మాటలని కొట్టిపారేశారు. రాజకీయం కోసమే మోదీ ఆయన మాటలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీజేపీపై కొట్లాడేది కేసీఆర్, కేజ్రీవాల్, సోరెన్లు మాత్రమేనని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమిలకు స్పష్టమైన మెజార్టీ రాదని, వాటికి 200చొప్పున సీట్లు రావని, బీఆరెస్ వంటి ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారవచ్చన్నారు. తెలంగాణను మోదీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోను ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. అప్పటి బీఆరెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్రెడ్డికి అనుకూలంగా మోదీ చేయాల్సిందంతా చేశారన్నారు. రేవంత్ చోటేబాయ్, మోదీ బడే బాయ్ మాటలు వాస్తవమన్నారు. అందుకే అమిత్ షా ఫేక్ వీడియోపై నేను కొట్టినట్లు..నీవు తిట్టినట్లుగా రేవంత్కు నోటీసులిచ్చారన్నారు.
బీఆరెస్ గెలుపుతోనే తెలంగాణ హక్కులు పరిరక్షణ
పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ గెలిస్తేనే తెలంగాణ హక్కులు సాధ్యమవుతాయని, బీఆరెస్ పోరాటంతోనే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రాజెక్టుల అప్పగింతపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. శ్రీశైలం నీరు తెలంగాణకు రావద్దని ఎస్ఎల్బీసీపై నాడు కాలం చెల్లిన టీబీఎం మిషన్లతో వైఎస్ఆర్ కుట్ర చేశారని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటా దక్కాలంటే బీఆరెస్ను గెలిపించాలన్నారు. తెలంగాణకు బీఆరెస్ చారిత్రక అవసరమన్నారు. 16 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్తున్నారన్నారని, చేవెళ్ల, వరంగల్, జహీరాబాద్లలో అభ్యర్థులు లేక బీఆరెస్ నేతలను చేర్చుకొని టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్లో సగం మంది ఎంపీ అభ్యర్థులు బీఆరెస్ నుంచి వెళ్ళిన వారే అని.. అంటే తాము బలంగా ఉన్నట్టే కదా? అని వ్యాఖ్యానించారు. అధికారం కోసం వలసలు సహజమని, అలాంటి వారు పార్టీలు మారుతునే ఉంటారన్నారు. గతంలో కంటే తమ ఓట్లు పెరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని.. 16 సీట్లలో బీఆరెస్ను గెలిపించాల్సిన అవసరముందన్నారు. ఓటమి భయంతోనే జానారెడ్డి వంటి నేతలు కూడా బీఆరెస్ నేతల ఇండ్లకు వెళ్లి కండువా కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
బిల్లులు ఇవ్వమని, కేసులు పెడుతామని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా, హామీలు, కరువు, రైతు సమస్యలు, మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు బయటకు రావద్దని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఐదునెలలో పాలనలో విద్యుత్తు వ్యవస్థ గాడి తప్పిందన్నారు. విద్యుత్ 24 గంటల సరఫరా పై లాగ్ బుక్కులను బయట పెడితే తెలుస్తుందన్నారు. బీఆరెస్ హయాంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా తాము రెండు గంటల్లో విద్యుత్తు పునరుద్ధరించామని తెలిపారు.