Shri Ganesh | కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన చాంబర్‌లో శాసన సభ్యునిగా శ్రీ గణేశ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు

  • Publish Date - June 20, 2024 / 03:15 PM IST

విధాత : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన చాంబర్‌లో శాసన సభ్యునిగా శ్రీ గణేశ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభృతులు శుభాకాంక్షలు తెలిపారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆరెస్ అభ్యర్తిగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 13,206 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ పార్టీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్‌ రెండో స్థానంలో నిలవగా, లాస్య నందిత సొదరి నివేదిత మూడో స్థానంలో నిలిచారు.

Latest News