Revanth Reddy | పేదల దేవాలయం నిమ్స్‌ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంస

పేదల దేవాలయం నిమ్స్ అని, బాణం గుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలో ఆదివాసీ యువకుడిని కాపాడి నిమ్స్ వైద్యులు ప్రజల్లో ఆసుపత్రి పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశంసించారు.

  • Publish Date - May 26, 2024 / 04:57 PM IST

బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్ వైద్యులు
సర్వత్రా అభినందనలు

విధాత, హైదరాబాద్‌ : పేదల దేవాలయం నిమ్స్ అని, బాణం గుచ్చుకుని ప్రాణాపాయ స్థితిలో ఆదివాసీ యువకుడిని కాపాడి నిమ్స్ వైద్యులు ప్రజల్లో ఆసుపత్రి పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ఛత్తీస్ గడ్‌లోని బీజాపూర్‌కు చెందిన గుత్తికోయ గిరిజన తెగకు చెందిన సోది నందాకు ఎవరో పంది వేటకు వదిలిన బాణం ఛాతిలో గుచ్చుకుని గుండెకు దగ్గరగా చేరి అతడిని ప్రాణాపాయ స్థితికి చేర్చింది. మొదట భద్రాచలం ఏరియా ఆసుపత్రి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, గాంధీకి తరలించారు. చివరికి నిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు.

ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు సమాచారం. అయితే నిమ్స్ వైద్యులు అతినిని ప్రత్యేక కేసుగా పరిగణించి మానవీయ కోణంలో ఫ్రీగా ట్రీట్ మెట్ చేశారు. దీంతో నిమ్స్‌ వైద్యులపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి సైతం ట్విటర్ వేదికగా నిమ్స్ వైద్యులపై ప్రసంశలు కురిపించారు. గిరిజన యువకుడు సోది నంద ఛాతి భాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్య బృందానికి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజల్లో నిమ్స్ ఆసుపత్రి పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారన్నారు. భవిష్యత్లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకున్నారు.

Latest News