హైదరాబాద్, విధాత: సచివాలయంలో అన్ని విభాగాల సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా అన్ని విభాగాల కార్యదర్శులతో సీఎం రివ్యూ ఏర్పాటు చేశారు. ప్రతీ సెక్రటరీ వారి వారి శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు జనవరి 26 లోగా సీఎస్ కు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్& ఈఎస్ఐ సదుపాయం అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల HOD లు వెరిఫై చేయాలని సీఎం సూచించారు. ఈ ప్రక్రియను జనవరి 26 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ఆదేశించారు.
ఈ రెండేళ్ల కాలంలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. అందుకే ముఖ్యమైన విభాగాలకు ఒక పాలసీ తీసుకున్నామని, రాష్ట్రానికి ఒక పాలసీ ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యూమెంట్ను విడుదల చేసుకున్నామన్నారు. రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం, స్పష్టమైన విధి విధానాలతో ముందుకు వెళుతున్నామని సీఎం పేర్కొన్నారు.
ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా అధికారుల సహకారం ఉండాలి, అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి, ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారని, కార్యదర్శులు సీఎస్కు ప్రతి నెల రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై సీఎం స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావు, సమన్వయం చేసుకుని పనిచేయడం అత్యంత కీలకమని సూచించారు.అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Check Power : బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు..పునరుద్దరణ
Swiggy : భారతీయుల క్రేజీ ఫుడ్ బిర్యానీ..పదేళ్లుగా నెంబర్ వన్
