CM Revanth|| నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. రూ.260.45 కోట్లతో ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం శంకుస్థాపన. రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి క్రింద స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపనకు శంకుస్థాపన. రూ.19.69 కోట్లుతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు.

  • By: Subbu |    telangana |    Published on : Dec 04, 2025 11:11 AM IST
CM Revanth|| నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. రూ.260.45 కోట్లతో ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం శంకుస్థాపన. రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి క్రింద స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపనకు శంకుస్థాపన. రూ.19.69 కోట్లుతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు.

రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన. 2 కోట్లతో మహాలక్ష్మి వాడ మరియు విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణ కు శంకుస్థాపన.పట్టణ భద్రతను మరింత బలోపేతం చేసి, శాంతి–భద్రతల పరిరక్షణను అత్యున్నత స్థాయిలో కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పబద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలోరూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, 2.6 కోట్లుతో 3 ఇంటెలిజెన్స్ విభాగం క్వార్ట్రర్స్, 2 కోట్లతో భరోసా కేంద్రం ప్రారంభ కార్యక్రమం.

పట్టణ అభివృద్ధికి, పరిశ్రమల పురోగతికి, ప్రజల దైనందిన జీవన విధానానికి అత్యంత కీలకమైన అంశం స్థిరమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా. ఈ క్రమంలో ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న రూ. 231.24 లక్షల నిధులతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద TGNPDCL ద్వారా 33/11 KV సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంఖు స్థాపన చేయనున్నారు.