భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేని దళిత, గిరిజన,మైనారిటీల వ్యతిరేక పార్టీ అయిన బీజేపీని ఎన్నికలలో ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
హసన్ పర్తిలో సీపీఐ విస్తృత ప్రచారం
విధాత, వరంగల్ ప్రతినిధి : భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేని దళిత, గిరిజన,మైనారిటీల వ్యతిరేక పార్టీ అయిన బీజేపీని ఎన్నికలలో ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఇండియా కూటమిలో భాగంగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కడియం కావ్య విజయాన్ని కాంక్షిస్తూ హసన్ పర్తిలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ నిరుద్యోగులకు, రైతులకు న్యాయం చేయలేని బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. విద్యావంతురాలిగా, వైద్యురాలిగా సేవలందించిన కడియం కావ్యను పార్లమెంట్ కు పంపిస్తే ఈ ప్రాంత ప్రజల గొంతును పార్లమెంట్ లో వినిపిస్తుందని అన్నారు.
హాసన్ సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, బికేఎంయూ జాతీయ నాయకులు మోతే లింగారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ రెడ్డి, బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు ఎన్. రాజమౌళి,ఎర్ర కుమార స్వామి, రాజకుమార్, చంద్రమౌళి,ఎర్ర నాగరాజు, భరత్, షేక్ బాబు, అజయ్, ఆర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.