భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్కు మద్దతుగా సీపీఎం పోటీ నుంచి తప్పుకుంటుందన్న వార్త కథనాల్లో నిజం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య స్పష్టం చేశారు
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య
విధాత : భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్కు మద్దతుగా సీపీఎం పోటీ నుంచి తప్పుకుంటుందన్న వార్త కథనాల్లో నిజం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి అయిలయ్య స్పష్టం చేశారు. ఆదివారం వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురంలో భువనగిరి సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ. జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాల్లో సీపీఎం పోటీలో లేదని, కేవలం భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రమే పోటీ చేస్తున్నామని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ మినహాయించి మిగతా 16 స్థానాల్లో ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సీపీఎం సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. అయితే భువనగిరి పార్లమెంటు స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తుల కలయిక లేదని స్పష్టం చేశారు. ఈ స్థానంలో నెలకొన్న చతుర్ముఖ పోటీలో సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ గెలవబోతున్నారని గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జహంగీర్ స్థానికంగా 30 మండలాల ప్రజలతో గత 35 ఏళ్లుగా ప్రత్యక్ష సంబంధాలు కలిగి నిరంతరం అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలోని సాగు, తాగునీరు, మూసి జల కాలుష్యం, స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇండ్లు లేని పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్లతో వివిధ వృత్తులకు చెందిన ప్రజల దీర్ఘకాలిక,తాత్కాలిక సమస్యలపై పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించాడని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులు నియోజకవర్గ ప్రజలను సైతం గుర్తు పట్టలేరని, ఈ ప్రాంతానికి వారు చేసిందేమి లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి జహంగీర్కు భువనగిరి పార్లమెంట్లో ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, మండల నాయకులు వేముల నాగరాజు, నాయకులు రేపాక ముత్యాలు, బంధారపు ధనంజయ, రాగిరు కృష్ణస్వామి, వేముల జ్యోతిబసు, చీర్క లక్ష్మమ్మ,వనగంటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.