మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి
విధాత : మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఉప్పర్ గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాల తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాకులకు మరమ్మత్తులు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేస్తున్నారు.