విధాత ,హైదరాబాద్: నగరంలో శ్మశానవాటికలు, అంబులెన్స్ల అధిక చార్జీలకు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మృతి చెందినవారికి బల్దియా ఆధ్వర్యంలో ఉచిత అంతిమయాత్ర వాహనాలను ఏర్పాటు చేశారు. ఆరు జోన్లలో 14 వాహనాలను అందుబాటులో ఉంచారు. డీసీఎం వ్యాన్లను అంతిమయాత్ర వాహనాలుగా మార్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలమేరకు బల్దియా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వాహనం కావాల్సినవారు కంట్రోల్ రూమ్కు (Helpline:21111111, Phone No.040-23225397) ఫోన్ చేస్తే 15నిముషాల్లో వాహనం వస్తుందని […]
విధాత ,హైదరాబాద్: నగరంలో శ్మశానవాటికలు, అంబులెన్స్ల అధిక చార్జీలకు చెక్ పెడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్తో మృతి చెందినవారికి బల్దియా ఆధ్వర్యంలో ఉచిత అంతిమయాత్ర వాహనాలను ఏర్పాటు చేశారు. ఆరు జోన్లలో 14 వాహనాలను అందుబాటులో ఉంచారు.
డీసీఎం వ్యాన్లను అంతిమయాత్ర వాహనాలుగా మార్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలమేరకు బల్దియా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వాహనం కావాల్సినవారు కంట్రోల్ రూమ్కు (Helpline:21111111, Phone No.040-23225397) ఫోన్ చేస్తే 15నిముషాల్లో వాహనం వస్తుందని చెప్పారు. అలాగే శ్మశానాల్లో కూడా రేటు ఫిక్స్ చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. ఒకవేళ అధిక చార్జీలు వసూలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.