ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారు: వీహెచ్‌

ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారని, నా అనుకున్న వాళ్లే వెన్నుపోటుపొడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు భావోద్వేగానికి గురయ్యారు

  • Publish Date - April 26, 2024 / 03:20 PM IST

నా అనుకున్నవాళ్లే వెన్ను పోటు పొడిచారు
అయినా చచ్చేదాకా కాంగ్రెస్‌లోనే ఉంటా
వి.హనుమంతరావు భావోద్వేగం

విధాత, హైదరాబాద్: ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇన్నాళ్లు నన్ను మోసం చేశారని, నా అనుకున్న వాళ్లే వెన్నుపోటుపొడిచారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తే రాలేదని నిర్వేదానికి గురయ్యారు.

అయినా నాకు పదవులు లెక్క కాదని, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. చచ్చేవరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించిన విహెచ్ ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. స్వయంగా సోనియాగాంధీకి లేఖ రాసిన సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం వైఖరిపై విహెచ్ అసంతృప్తిని వెళ్లగక్కారు.

Latest News