ఈసీ ఆదేశాలను పాటించాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
విధాత, జనగామ :
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు…. దేవరోప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలకు సంబంధించిన 91 గ్రామ పంచాయతీలు, 800 వార్డులకు జరిగే మూడవ విడత నామినేషన్ ప్రక్రియ కి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్నారు.సాయంత్రం 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియ ను త్వరగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామపంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలన్నారు. నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించరని.. నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram