కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించింది.
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బ్యారేజీల వైఫల్యాలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలించింది. పీసీ ఘోష్ బృందం శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద ఉన్న పార్వతి బ్యారేజ్ (సుందిళ్ల)ని పరిశీలించారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలను పరిశీలించి మరమ్మతు పనుల వివరాలను సమీక్షించారు. మేడిగడ్డ వద్ద సీపేజీల నివారణ చర్యలు..గేట్ల మరమ్మతులు…కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తమకు అందిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించారు. అంతకు ముందు సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయంలో చంద్రఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరం బ్యారేజీల అక్రమాలపై విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఘోష్ ఈనెల 20వరకు హైదరాబాద్లోనే ఉండి నెలాఖరుకల్లా నివేదిక ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఇందులో భాగంఆ నిర్మాణ సంస్థలకు, ఇంజనీరింగ్ అధికారులకు, మాజీ ప్రజాపతినిధులకు నోటీస్లు ఇచ్చి విచారణ కూడా చేయవచ్చని సమాచారం.