బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపైన విశ్వాసం, భవిష్యత్తుపై నమ్మకం లేకనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతున్నారని, అందులో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లు చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపైన విశ్వాసం, భవిష్యత్తుపై నమ్మకం లేకనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతున్నారని, అందులో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లు చేరారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుకవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆరెస్లో ఉండలేక రేవంత్ రెడ్డి పై నమ్మకంతో ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారన్నారు. కేటీఆర్ రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని.. ఫిరాయింపులకు పాల్పడింది ముందు మీరు కాదా? అని..ఆనాడు ప్రగతి భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎటు పోయిందీ మీ నిజాయతి అని ప్రశ్నించారు. ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీదని పేర్కొన్నారు. బోగాల కుటుంబం కల్వకుంట్ల వారిదన్నారు. హరీష్ రావును ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఆరుగురు చొప్పున బీఆరెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఇప్పటికే డబుల్ సిక్సర్ కొట్టామని, మరో సిక్సర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడతారని, భవిష్యత్తులో మీతో ఎవరు ఉంటారో చూసుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ కహానీలు, పేదరాసి పెద్దమ్మ కథలు చెప్తున్నాడని విమర్శించారు. కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రిని అంటాడని ఎద్దేవా చేశారు. అధికారం మీద కేసీఆర్కు యావ తగ్గలేదన్నారు. ఇంకా ఊహల్లో భ్రమల మధ్య ఉన్నాడని సైకాలాజిస్టుకు చూపించుకోవాలని హితవు పలికారు. బీఆరెస్ ఓడితే మహారాష్ట్ర రైతులు బాధపడుతున్నారని అంటాడని.. అసలు అక్కడ బీఆరెస్ శాఖ కూడా లేదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు బంధు పేరిట 20 వేల కోట్లు కొండలు, గుట్టలకు ఇచ్చాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్ష పాతి అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆరెస్కు లేదన్నారు. ఆగస్ట్ 15 లోపు 31వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని, హరీశ్రావు సవాల్ చేసినట్లుగా స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు