సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడలేడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడలేడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీపై హరీశ్ రావు సవాల్ విరిరాడు కాబట్టి చెప్పిన టైమ్ కు గన్ పార్క్ కు వచ్చాడని, సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడలేడన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే అక్కడికి రాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఇంచార్జీగా ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ నిధులు మళ్లించి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.
కాబట్టే ఇక్కడ హామీలు అమలు చేయలేక పోతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తూ, అదే అంశంపై బీజేపీ మీద విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే దేవుళ్ళ మీదకాదు.. నీ మీద నీ కుటుంబసభ్యుల మీద ఒట్టేసి హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కడియం శ్రీహరి ఏ సామాజిక వర్గంకు చెందన వాడో ఒక నిజనిర్ధారణ కమిటీ వేసుకోని తన నిజాయితీ నిరూపించుకోవాలన్న రేవంత్రెడ్డి ఇప్పుడు ఆయన బిడ్డకు లోక్సభ టికెట్ ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. అందుకే రేవంత్ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు.