C.M. REVANTH REDDY | మహిళా సంఘాల సభ్యులను కోటికి చేర్చాలి … కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

మహిళా స్వయం సహాయక సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులుండగా, కోటి మంది సభ్యులుగా చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మట్లాడారు.

C.M. REVANTH REDDY | మహిళా సంఘాల సభ్యులను కోటికి చేర్చాలి … కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

మహిళా సంఘాల అద్దె బస్సులపై పరిశీలన
అర్హులైన అందరికి ఆరు గ్యారంటీలను అందించాలి

విధాత, హైదరాబాద్ : మహిళా స్వయం సహాయక సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులుండగా, కోటి మంది సభ్యులుగా చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మట్లాడారు. మహిళల ఆర్ధికాభ్యున్నతి కోసం ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. అలాగే ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులై ఉండీ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని, ఆగస్టు 15 లోగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడటమే కాకుండా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సమావేశంలో కలెక్టర్లను ఆదేశించారు.