భారతదేశంలో పెట్టుబడులకు తెలంగాణ ఫస్ట్ చాన్స్గా నిలిచింది, తెలంగాణకు భారీగా విదేశీ పెట్టబుడులు తేవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డి.శ్రీధర్బాబులు తెలిపారు.
విధాత, హైదరాబాద్ : భారతదేశంలో పెట్టుబడులకు తెలంగాణ ఫస్ట్ చాన్స్గా నిలిచింది, తెలంగాణకు భారీగా విదేశీ పెట్టబుడులు తేవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డి.శ్రీధర్బాబులు తెలిపారు. మంత్రుల బృందం పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న క్రమంలో అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్ కార్యాలయంలో ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్తో రాష్ట్ర బృందం సమావేశమైంది. అలాగే కోకా కోలా గ్రూప్ డైరక్టర్ జోనథన్ రీఫ్తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రులు ఆయా కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై మంత్రులు ప్రెజంటేషన్ ఇచ్చారు. దీనిపై కృష్ణకుమార్, డెల్టా ఎయిర్ లైన్స్ టీమ్, అలాగే కోకా కోలా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్ను కోరారు. నేరుగా విమానాలు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోరారు. వారి అభ్యర్ధన పట్ల కూడా డెల్టా ఎయిర్ లైన్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటానుని హామీ ఇచ్చారు. డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధుల స్పందన పట్ల ఇరువురు మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్లో కోకా కోలా పెట్టుబడులు పెడుతుందని డైరక్టర్ జోనథన్ రీఫ్ పేర్కోన్నారు. ఈ భేటీల్లో మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తోపాటు ఇతర బృందం పాల్గొన్నారు.