ప్రాజెక్టులలో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లో నల్లగొండ ఎంపీ
హామీలపై మోసపూరిత మాటలు
కంచర్ల నామినేషన్లో మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి
విధాత : ప్రాజెక్టులలో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్లో నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థం అయిందని విమర్శించారు.
రుణమాఫీ పై మాట మార్చి అన్నదాతలను నిలువునా మోసం చేసిందని, ఎంతసేపు ప్రతిపక్ష నేత కేసీఆర్ను సీఎం రేవంత్ బూతులు తిడుతూ, అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి రుణమాఫీకి అంతా తొందర ఎందుకు అని అంటున్నాడని, సీఎం ఆగస్టు 15 తర్వాతా అమలు చేస్తామంటున్నాడని దుయ్యబట్టారు. రైతుబంధు అడిగితే ఓ జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అని అంటున్నాడని, అతడిని చెప్పుతో కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమైక్య పాలనలో పదవుల కోసం నోరు ముసుకున్నకాంగ్రెస్ వాళ్లని పార్లమెంటు ఎన్నికల్లో తన్ని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సాగర్ నీళ్లను దోచుకుపోతుంటే మంత్రులు టైమ్పాస్ చేస్తున్నారని, కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాగర్ డ్యామ్ మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదని, రేపు రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి వీటి అన్నిటిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గులాబీ జెండానే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని, బీఆరెస్ ఎంపీలు గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ ప్రభంజనం సృష్టించబోతుందని, గులాబీ జెండాకు..కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని, ఈ ఎన్నికల్లో ఎగిరెది గులాబీ జెండా అని ధీమా వ్యక్తం చేశారు.