ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు
విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ కావేరి బజా ఈనెల 6 వాయిదా వేశారు. సీబీఐ, ఈడి కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ లపై ఇప్పటికే విచారణ పూర్తయింది. కవిత విచారణను.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆమెకు బెయిల్ ఇవ్వరాదని ఈడి, సీబీఐ లు వాదించాయి. అయితే ఇప్పటిదాకా లిక్కర్ కేసులో కవిత పాత్ర పై దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు చూపలేదని.. ప్రజా ప్రతినిధిగా, మహిళగా ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈనెల 6న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు.