ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జూలై 18వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన సీబీఐ ఆమెపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జూలై 18వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 11న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన సీబీఐ ఆమెపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు జూలై 25వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.