Site icon vidhaatha

Telangana | ప్రారంభ రోజే ‘పాఠశాల’ యూనిఫారమ్‌లు

విద్యార్థులకు అందజేయనున్న ప్రభుత్వం
కొత్త ఒరవడికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం
మహిళా సంఘాలకు స్టిచింగ్ బాధ్యతలు
విజయవంతమైన ప్రభుత్వ ప్రణాళిక

విధాత ప్రత్యేక ప్రతినిధి: పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యం నేరవేరింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో అందజేయాలనే నిర్ణయం ఆచరణలో రూపుదిద్దుకున్నదీ. యూనిఫామ్ స్టిచింగ్ పనులు సకాలంలో పూర్తయ్యేలా రాష్ట్ర మంత్రి  దనసరి సీతక్క ప్రణాళిక బద్దంగా వ్యవహరించారు.

మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను ప్రభుత్వం అప్పగించిన నాటి నుంచి, ఎప్పటికప్పుడు అధికారులను, మహిళా సంఘాలను సమన్వయపరుస్తూ గడువు లోగా పాఠశాలకు యూనిఫాంలో చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యాన్ని నేర‌వేరింది.

మహిళల అభివృద్ధి ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులను అప్ప‌గించారు. యూనిఫాం స్టిచింగ్ పనులను దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ఈ పనులను అప్ప‌గించింది. ప్రయోగం సక్సెస్ కావడంతో మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గురువారం రేవంత్ రెడ్డిని కలిసి మహిళా సంఘాల పక్షాన పుష్పగుచ్చం అందజేశారు.

మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి

గతంలో యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను పరిమిత సంఖ్యలో టైలర్లకు అప్పగించడం వల్ల, యూనిఫాంలు ఆలస్యమయ్యేవి. పాఠశాల ప్రారంభమైన మూడు నాలుగు నెలల వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందేవి కావు.  ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.  దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను అప్పగించింది. దీంతో పాటుగతంలో 50 రూపాయలున్న కుట్టు కూలీని 75 రూపాయలకు పెంచింది. దీంతో మహిళా సంఘాలు యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను సవాలుగా తీసుకోని, సకాలంలో పూర్తి చేయగలిగాయి.

రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉండగా 18వేల విలేజ్ ఆర్గనై షన్లు ఉన్నాయి. వారికి 15, 30,603 (ఒక జత) యూనిఫామ్‌లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటివరకు 90% యూనిఫాంలు పూర్తయ్యాయి. మహిళా సంఘాలు సహాయకులకు ఈ పనిని చేసినందుకు సుమారు Rs.50 కోట్లు స్టిచ్చిoగ్ ఆదాయం లభించింది. ప్రతి సoవత్సరం ఈ ఆదాయం సమకూరుతుంది.

భవిష్యత్‌లో కూడా మహిళ సంక్షేమా కార్యక్రమాలు ద్వారా, ఇంక ఆదాయం పరమైన పనులు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  దానితో పాటు రెండవ జత యూనిఫామ్ కుట్టేందుకు  అందజేయకుట్టేందు సంసిద్దంగా ఉన్నారు. రాబోయే రోజులలో ఇతర ప్రభుత్వ స్టిచింగ్ పని కూడా సెల్ఫ్ సెల్ఫ్ గ్రూపులకు అందజేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సమిష్టి కృషితో సక్సస్

సకాలంలో పనులు పూర్తి చేసేలా వ్యవహరించిన మహిళా సంఘాలు, అన్ని స్థాయిలోని అధికారులను మంత్రి సీతక్క అభినందించారు. కాగా, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ కి సిద్దం అయ్యాయి.  ఈ  కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు యూనిఫాంలు మొద‌టి రోజే అంద‌జేయనున్నారు.

Exit mobile version