విధాత: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలో భారీగా రైళ్లలో భారీగా రద్దీ ఉంటున్నది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా అవి ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
కాచిగూడ-కాకినాడ టౌన్ మధ్య అక్టోబరు 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు (07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. తిరుగు మార్గంలో అక్టోబరు 20, 27 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి ప్రత్యేక రైలు (07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కాగా.. ఆయా రైళ్లు మల్కాజ్గిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ఆయా రైళ్లలో ఫస్ట్ ఏసీ, 2 టైర్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని వివరించింది.