అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ అయ్యారు. రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర ప్రస్తుతం చికాగోలో విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
పోలీసులను సంప్రదించిన తల్లిదండ్రులు
విధాత, వరంగల్ ప్రతినిధి: అమెరికాలో వారం రోజులుగా మరో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ అయ్యారు. రాష్ట్రంలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్ర ప్రస్తుతం చికాగోలో విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
రూపేష్ చంద్ర మే 2 నుంచి అదృశ్యమయ్యాడు. చివరిగా మే 2న మధ్యాహ్నం కొడుకు రూపేష్ చంద్రతో వాట్సప్ కాల్ మాట్లాడిన అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాప్లోకి వెళ్లిపోయిందని తండ్రి పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్తో మాట్లాడగా, ఎవర్నో కలవడానికి వెళ్లాడని వారు ఎవరో తమకు తెలియదని బదులిచ్చారు. రూపేప్ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం అందించారు. అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.