విధాత, హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ప్రయాణికులకు, వాహనదారులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల టికెట్ రేట్లపై 30% డిస్కౌంట్ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కొరత వేళ ఈ డిస్కౌంట్ ప్రకటించినట్లుగా తెలంగాణ ఆర్టీసీ పేర్కొంది.
“పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా” అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. బంకుల వద్ద బారులు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
నాపై పోటీకి నువ్వేరా: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Savitrii | మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు … ప్రేమ, విజయం, విషాదం వెనుక అసలు కథ
