Axis Credit Card | యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకుకు చెందిన మాగ్నస్ క్రెడిట్ కార్డుపై ఇప్పటి వరకు పొందుతున్న బెనిఫిట్స్లో భారీగా కోతలు విధించింది. ఈ మేరకు కొత్తగా మార్పులను చేస్తూ నోటిఫై చేసింది. కార్డుపై రివార్డు పాయింట్లను తగ్గించింది. అలాగే రివార్డు పాయింట్ల రాకుండా పలు చెల్లింపుల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. మారిన నిబంధనలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కొత్తగా ఆన్బోర్డ్ అయిన సభ్యులను […]
Axis Credit Card |
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకుకు చెందిన మాగ్నస్ క్రెడిట్ కార్డుపై ఇప్పటి వరకు పొందుతున్న బెనిఫిట్స్లో భారీగా కోతలు విధించింది. ఈ మేరకు కొత్తగా మార్పులను చేస్తూ నోటిఫై చేసింది. కార్డుపై రివార్డు పాయింట్లను తగ్గించింది. అలాగే రివార్డు పాయింట్ల రాకుండా పలు చెల్లింపుల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. మారిన నిబంధనలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.
కొత్తగా ఆన్బోర్డ్ అయిన సభ్యులను టాటా క్లిక్ వోచర్ల మినహాయించగా.. వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి కొత్త యూజర్లకు టాటా క్లిక్ వోచర్లు అందుబాటులో ఉండవు. అయితే, యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డుకు యూజర్ల నుంచి విశేష ఆదరణ ఉంటుంది.
కార్డ్పై చాలా బెనిఫిట్స్ ఉండడంతో ఈ కార్డ్ను వాడేందుకు యూజర్స్ ఆసక్తిని చూపిస్తుండగా.. ఆయా ప్రయోజనాల్లో కోత పడనున్నది. ఈ కార్డు ప్రతి రూ.200 కోనుగోలుపై 12 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అందిస్తోంది. ఈ ఒక్కో ఎడ్జ్ రివార్డు పాయింట్ విలువ 20పైసలు ఉంటుంది. అంటే బేస్ రివార్డు రేటు 1.2 శాతమన్నమాట.
అలాగే ఇకపై బుర్గండీని యాక్సెస్ చేయాలంటే కస్టమర్లకు నెల వారీ శాలరీ రూ.3 లక్షలకుపైన ఉండాల్సి ఉంటుంది. అయితే, రివార్డు పాయింట్లలో కోత, పలు చెల్లింపుల్లో మినహాయింపుల వెనుక కారణం యాక్సిస్ మాగ్నస్, యాక్సిస్ బుర్గండీ రివార్డ్స్ను కలిపేందుకేనని బ్లూమ్బెర్గ్ క్వింట్ తెలిపింది. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోత పెట్టినప్పటికీ ఇప్పటికీ క్రెడిట్ కార్డు బిజినెస్లో యాక్సిస్ బ్యాంక్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.
మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్ కార్డుల వాటా 14శాతం. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకుల్లో యాక్సిస్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఏకంగా 4.2 మిలియన్ క్రెడిట్ కార్డులను జారీ చేసింది. మార్చి 31, 2023 నాటికి క్రెడిట్ కార్డులపై ఇచ్చిన లోన్స్ రూ.31,684 కోట్లు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 97శాతం పెరుగుదల నమోదైంది.
ఎయిర్లైన్స్, హోటల్ మైల్స్ ప్రోగ్రామ్లో స్వైపింగ్ ద్వారా వచ్చే రివార్డు పాయింట్లలో బ్యాంకు కోత పెట్టింది. గతంలో నాలుగు మైల్స్కు ఐదు రివార్డు పాయింట్లు వచ్చేవి. ఇప్పుడు దాన్ని ఐదు మైల్స్కు రెండు రివార్డు పాయింట్లకు కుదించింది. వార్షిక ఫీజు ఇప్పటి వరకు రూ.10వేలు ప్లస్ జీఎస్టీ ఉండేది. దీన్ని సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత తీసుకునే వారికి రూ.12,500 ప్లస్ జీఎస్టీ సైతం చెల్లించాల్సి ఉంటుంది.
రూ.10వేల విలువైన వార్షిక వోచర్ ఇకపై అందుబాటులో ఉండదు. రూ.25 లక్షలు ఖర్చు చేసే వారికి వార్షిక ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు తీసుకునే వారు రూ.15లక్షలు ఖర్చు చేస్తేనే ఈ బెనిఫిట్ లభిస్తుంది. సెప్టెంబర్ 1, 2023 తర్వాత నెలవారీ రూ.1 లక్ష ఖర్చుపై వచ్చే రూ.25వేల ఎడ్జ్ రివార్డ్ పాయింట్ రావు.