గణేశ్‌ నిమజ్జనం.. మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు

విధాత‌, హైద‌రాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై 22 క్రేన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమజ్జనం నేపథ్యంలో రేపు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 12వేలకుపైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు . విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం కారణంగా […]

గణేశ్‌ నిమజ్జనం.. మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు

విధాత‌, హైద‌రాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై 22 క్రేన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమజ్జనం నేపథ్యంలో రేపు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 12వేలకుపైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు

. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

నిమజ్జనం కారణంగా హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలిగింపునకు 20 జేసీబీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సాగర్‌ చుట్టూ ఉన్న 200 సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు.

కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌కు పోలీసులు అనుసంధానం చేయనున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, వైద్య శాఖల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.

ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రేపటికి బదులుగా నవంబరు 12న (రెండో శనివారం) పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.