Tirumala temple closure | చంద్రగ్రహణం కారణంగా రేపు 7న శ్రీవారి ఆలయం మూసివేత
రేపటి చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తులకు దర్శనం, సేవలలో మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన, సేవా కార్యక్రమాలను సవరించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Tirumala temple closure | తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) జరగబోయే చంద్రగ్రహణం కారణంగా ఆలయ కార్యకలాపాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆచార, సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయనుంది. అందువల్ల రేపు సాయంత్రం 3.30 గంటల నుండి ఆలయం మూసివేయబడుతుంది.
చంద్రగ్రహణం కారణంగా రేపు సాయంత్రం 3.30 గంటల నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. సేవలు, అన్నప్రసాదాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
చంద్రగ్రహణం సమయాలు
- ప్రారంభం: రాత్రి 9.50 గంటలకు
- ముగింపు: సోమవారం వేకువజామున 1.31 గంటలకు
- మొత్తం వ్యవధి: సుమారు 3 గంటల 40 నిమిషాలు
- ఆలయ మూసివేత: రేపు సాయంత్రం 3.30 గంటల నుండి
- తెరవబడే సమయం: సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో
ఆలయ సేవలలో మార్పులు
- శుద్ధి, పుణ్యహవచనం అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
- ఉదయం 6 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
- రేపటి ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు అయ్యాయి.
అన్నప్రసాదాల పంపిణీ
- రేపు సాయంత్రం 3 గంటల నుండి అన్నప్రసాదాల వితరణ నిలిపివేయబడుతుంది.
- సోమవారం ఉదయం 8.30 గంటలకు మళ్లీ అన్నప్రసాదాల పంపిణీ పునఃప్రారంభమవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram