విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా […]
విధాత: ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ సేవలు 12 గంటలపాటు నిలిచిపోనున్నట్లు ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణపరమైన పనుల్లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఆదాయపన్ను వెబ్సైట్ సేవలు అందుబాటులో ఉండవని ఐటీ విభాగం తెలిపింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ వెబ్సైట్లోని ఇతర సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది.