Bhu Bharathi । భూభారతి చట్టంతో తెలంగాణ రైతులకు ప్రయోజనం ఏమిటి?

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చలన్నీ కొత్తగా అమల్లోకి రానున్న భూభారతి చట్టం గురించే! ఇన్నాళ్లూ ధరణితో ఇబ్బందులు పడిన రైతాంగం.. తమ సమస్యలకు భూ భారతిలోనైనా పరిష్కారాలు దొరుకుతాయని ఆశపడుతున్నారు. ఆ ఆశలు ఎంత వరకూ నెరవేరుతాయి? చట్టంలో మార్పులేంటి? సమస్యలకు పరిష్కారాలేంటి?

Bhu Bharathi । భూభారతి చట్టంతో తెలంగాణ రైతులకు ప్రయోజనం ఏమిటి?

(తిప్పన కోటిరెడ్డి)
Bhu Bharathi । భూమికి ప్రజ­లకు విడ­దీయలేని సంబంధం ఉంది. తెలం­గాణలో పోరా­టా­లన్నీ (struggles) భూమి చుట్టూనే తిరి­గాయి. అలాంటి తెలం­గా­ణ(Telangana)లో భూమి సమ­స్యల పరి­ష్కార వ్యవస్థ ప్రజ­లకు నిత్యం అందు­బా­టులో ఉండాలి. కానీ 2020లో ధరణి చట్టం అమ­లు­లోకి వచ్చి­న­ప్పటి నుంచి భూమి సమ­స్యల పరి­ష్కార వ్యవస్థ ప్రజ­లకు దూర­మైంది. గ్రామంలో రెవెన్యూ అధి­కారి లేడు.. తాసి­ల్దార్‌ దగ్గ­రకు వెళితే.. ‘నేను చేయ­గ­లి­గేది ఏమీ లేదు… ధరణి (Dharani portal) పోర్ట­ల్‌లో దర­ఖాస్తు చేసు­కోండి.. కలె­క్టర్ చూస్తారు’ అంటూ తిప్పి పంపిం­చే­వారు. వ్యక్తి­గ­తంగా వెళ్లి జిల్లా కేంద్రంలో ఉన్న కలె­క్ట­ర్‌ను కలు­వడం సగటు రైతుకు సాధ్యం అయ్యే పని కాదు. ఇలా 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం అధి­కా­రు­లకు, రైతు­లకు మధ్య ఉన్న లింకును తెంపే­సింది. రైతులు కానీ, అధి­కా­రులు కానీ కంప్యూ­ట­ర్‌తో మాత్రమే మాట్లా­డేలా చేసింది. దర­ఖాస్తు చేసుకో… ఆ తరు­వాత కలె­క్టర్ దైవా­ధీనం. తాసి­ల్దార్(Tahsildar), ఆర్డీ­వో (RDO)­లను నాటి సర్కారు వేలిముద్రగాళ్లను మాత్రమే చేసిం­దన్న అభి­ప్రా­యాలు కూడా వ్యక్త­మ­య్యాయి. తాసి­ల్దా­ర్‌కు కనీసం రిజి­స్ట్రే­షన్ చేసే బాధ్య­త­ల­నైనా ఇచ్చారు. ఆర్డీ­వో­ల­నైతే ఎందుకు కొర­గాని ఆరో వేలుగా నాటి సర్కారు దిగ­జా­ర్చిం­దన్న విమ­ర్శలు విని­పిం­చాయి. లక్షల ఎక­రాల భూమి సమ­స్య­లన్నీ అలాగే పెండిం­గ్‌లో ఉన్నాయి. వ్యవ­సాయం చేసు­కునే రైతు తన భూమి సమస్య పరి­ష్కారం కావా­లంటే సివిల్ కోర్టుకు వెళ్లా­ల్సిన దుస్థితి నాటి సర్కారు కల్పిం­చింది.

హైకోర్టు ఆదేశించినా నాడు మారని ధరణి
ధర­ణిలో రైతులు ఎదు­ర్కొ­టున్న భూమి సమ­స్య­లపై గతంలో హైకోర్టు (High Court) న్యాయ­మూర్తి జస్టిస్‌ లక్ష్మణ్ ఘాటు వాఖ్యలు చేసిన విషయం అంద­రికీ తెలి­సిందే. ధరణి పోర్టల్ వల్ల బ్రోకర్లు బాగు పడు­తు­న్నా­ర­న్నారు. ధరణి పోర్ట­ల్‌లో సమ­స్యలు పరి­ష్కారం అవడం లేదని కోర్టుకు రోజుకు 30, 40 పిటి­షన్ల వస్తు­న్నా­యని, వీటిని ఎలా పరి­ష్క­రి­స్తా­రని సీసీ­ఎ­ల్‌­ఏను ఆనాడు కోర్టు ప్రశ్నిం­చింది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం కార­ణంగా సీసీ­ఎల్ఏ (CCLA)..  హైకోర్టు బోనులో తల­దిం­చు­కొని నిల­బ­డా­ల్సిన దుస్థితి ఏర్ప­డింది. ధర­ణిపై కోర్టుకు వచ్చిన కేసు­లను పరి­శీ­లిస్తే ధర­ణిలో 20 రకాల సమ­స్యలు (20 types of problems) ఉన్నట్లు గుర్తిం­చి­నట్లు నాటి న్యాయ­మూర్తి తెలి­పారు. ధరణి సమ­స్య­లను 2024 జూన్ నాటికి పరి­ష్క­రిం­చా­లని హైకోర్టు ఆదే­శిం­చినా చట్టం­లో ఉన్న అడ్డం­కుల కార­ణంగా సమ­స్య­లను పరి­ష్క­రించ లేక పోయింది సర్కారు. ఆ యా సమ­స్య­లను పరి­ష్క­రిం­చా­లంటే చట్టాన్నే మార్చా­లన్న నిర్ణ­యా­నికి వచ్చామని కొత్త ప్రభుత్వం చెబుతున్నది. ధరణిలో సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేసుకున్నా.. అవి రిజక్ట్ కావడమే కానీ పరిష్కారం అయ్యేవి కాదని అనేక మంది రైతులు చెబుతున్నారు. ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత భూమి సమస్యలు 20 లక్షలకు పైనే ఉన్నాయని గుర్తించారు. 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బీ(Part B)లో ఉన్నాయి. ఇవి రికార్డుల్లోకి ఎక్కలేదు. వీటి పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూల్స్ తీసుకు వచ్చినా ఎగ్జిక్యూట్‌ చేసే అధికారులకు అధికారాలు లేక అవి అపరిష్కృతంగానే పడి ఉన్నాయి. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ యా సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించిన తరువాత కొన్ని పరిష్కారం అయ్యాయి. మరికొన్ని అలాగే ఉన్నాయి. వాస్తవంగా ధరణి చట్టం చాలా వాటికి పరిష్కారం చూపించలేక పోయింది. ముఖ్యంగా భూమి రికార్డు, పాస్ పుస్తకాల సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలకి ఆ చట్టంలో పరిష్కారం లేదు… ఆ చట్టాన్ని సవరించితే కూడా సరిపోదు… సమగ్రంగా మారిస్తే తప్పక రైతాంగ సమస్య పరిష్కారం దొరకదు.

కోర్టు మెట్లెక్కాల్సిన పని లేకుండా..
భూ పరి­పా­ల­నలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో పర్య­వే­క్షక వ్యవస్థ ఉండా­లన్న నిర్ణ­యా­నికి వచ్చిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు, భూమి సమ­స్యల పరి­ష్కా­రా­నికి రైతులు (farmers ) కోర్టుల మెట్లు ఎక్కా­ల్సిన అవ­సరం లేకుండా అధి­కా­రుల స్థాయి­లోనే పరి­ష్కారం అయ్యే మార్గా­లను పరి­శీ­లిం­చారు. ఈ మేరకు ధర­ణిపై కమిటీ వేసిన రేవంత్ రెడ్డి.. ఆ కమిటీ ఇచ్చిన సూచ­నల మేరకు భూ భారతి చట్టాన్ని తీసు­కొ­చ్చారు. ఈ చట్టం (Act) అమ­లు­లోకి రావ­డా­నికి ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లును గవ­ర్నర్ ఆమో­దా­నికి పంపిం­చారు. గవ­ర్నర్ సంతకం తరు­వాత చట్టం అమ­లు­లోకి రాను­న్నది.

నాడు కేంద్రీకృతం.. నేడు వికేంద్రీకరణ
ధరణి చట్టంలో అధి­కా­రాలు కేంద్రీకృతం చేయగా భూ భారతి చట్టం అధి­కా­రాలను వికేం­ద్రీ­క­రణ చేస్తు­న్నది. ధర­ణిలో కలె­క్టర్‌కు పరి­మిత అధి­కా­రాలు, ఆపైన సీసీ­ఎల్ఏ, లేదా సివిల్ కోర్టు మాత్రమే. పైగా గ్రామ స్థాయిలో ఉండే పర్య­వే­క్షక అధి­కారి (వీఆర్వో) వ్యవ­స్థను రద్దు చేసింది. కానీ కొత్తగా అమ­లు­లోకి రానున్న భూ భారతి చట్టంలో గ్రామ స్థాయిలో పర్య­వే­క్షక అధి­కారి ఉండా­లని స్పష్టం చేసింది. రైతులు కలె­క్టర్ వద్దకో.. కోర్టుల చుట్టూ­తనో తిర­గా­ల్సిన అవ­సరం లేకుండా మండల స్థాయిలో తాసి­ల్దారే భూమి సమ­స్య­లను పరి­ష్క­రించే అవ­కా­శాన్ని కల్పిం­చింది. ఈ మేరకు తాసీ­ల్దార్ కు అధి­కా­రాలు అప్ప­గిం­చింది. ఆపైన ఆర్డీ­ఓకు పర్య­వే­క్షించే అధి­కారం కల్పిం­చింది. ఇలా తాసీ­ల్దార్ వద్ద పరి­ష్కారం కానీ సమ­స్య­లను ఆర్డీఓ వద్ద, అక్కడ పరి­ష్కారం కాకుండా కలె­క్టర్ వద్ద రివి­జన్ పిటీ­షన్ వేయించి పరి­ష్క­రిం­చు­కునే అవ­కా­శాన్ని భూ భారతి చట్టం కల్పి­స్తోంది. దీంతో రైతులు తమ భూమి సమ­స్యల పరి­ష్కారం కోసం ఎక్క­డె­క్క­డికో వెళ్లా­ల్సిన అవ­సరం లేకుండా స్థాని­కంగా పరి­ష్క­రించే అవ­కా­శాన్ని కొత్త ప్రభుత్వం కల్పిం­చ­ను­న్నది.

కింది స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం
కింది స్థాయి­లోనే భూ సమ­స్యల పరి­ష్కార వ్యవస్థ ప్రజ­లకు అందు­బా­టులో ఉండా­లని న్యాయ­ని­పు­ణులు చెపు­తు­న్నారు. అయితే బీఆ­రెస్ (BRS) నేతలు, వారిని సమ­ర్థించే మీడియా మాత్రం భూ సమ­స్యల పరి­ష్కార వ్యవస్థ కింది స్థాయిలో అందు­బా­టు­లోకి వస్తే అవి­నీతి పెరు­గు­తుం­దని చెపు­తు­న్నది. గతంలో రెవె­న్యూ శాఖలో అవి­నీ­తిని రూపుమాపేం­దుకే కింది స్థాయిలో అధి­కా­రు­లకు ఉన్న అధి­కా­రా­లన్నీ రద్దు చేశా­మని చెప్పు­కు­న్నది. అయితే.. ధరణి వచ్చిన తరు­వాత అధి­కా­రా­లన్నీ కేంద్రీకృతం కావ­డం­తోనే అవి­నీతి బాగా పెరి­గిం­దన్న ఆరో­ప­ణలు బలంగా విని­పిం­చాయి. ధరణి చట్టం రాక ముందు వేయి రూపా­యలు ఇస్తే సమస్య పరి­ష్కారం అయ్యే­దని, ధరణి వచ్చి­న­ త­రు­వాత వేయి రూపా­యలు పెట్టి ఆన్‌లైన్‌లో దర­ఖాస్తు చేస్తే ‘రిజక్ట్’ అని సమా­ధానం వచ్చే­దని ప్రతా­ప­రెడ్డి అనే రైతు తెలి­పారు. దర­ఖా­స్తు­లకే వేల రూపా­యలు ఒడిసేవన్నారు. రంగా­రెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు మాట్లా­డుతూ పాత రోజుల్లో వేయి రూపా­య­లతో అయ్యే పని ధరణి వచ్చిన తరు­వాత లక్షలు ఖర్చు చేసినా కాలే­దని వాపో­యాడు. ధరణి వచ్చిన తరు­వాత, అధి­కా­రాలు కేంద్రీకృతం కావడం ఫలి­తంగానే అవి­నీతి పెరి­గిం­దని సీని­యర్ జర్న­లిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. అధి­కా­రాలు వికేం­ద్రీ­క­రి­స్తేనే ఫలి­తాలు బాగుం­టా­యని, ఒక చోట అన్యాయం జరి­గితే మరో చోటనైనా న్యాయం దొరుకుతుందని చెప్పారు. అధి­కా­రాల వికేం­ద్రీ­క­ర­ణతో పాటు అప్పీల్ వ్యవస్థ ఉండా­లని సదరు జర్న­లిస్ట్ అన్నారు. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో తాసి­ల్దార్ నుంచి కలె­క్టర్ వరకు అంద­రికీ అధి­కా­రా­లు­న్నా­యని, అప్పీల్ వ్యవస్థ ఉందని సీని­యర్ రెవెన్యూ అధి­కారి ఒకరు అన్నారు. ఈ వ్యవస్థ వల్ల రైతు­లకు మేలు జరు­గు­తుం­ద­న్నారు.

భూ భార­తి­లో తాసి­ల్దా­ర్లకు అధి­కా­రాలు
ధరణి చట్టంలో భూమి సమ­స్యను పరి­ష్క­రిం­చ­డా­నికి అధి­కా­రు­లకు ఎలాంటి అధి­కా­రాలు లేవని న్యాయ నిపు­ణులు సునీల్ కుమార్ తెలి­పారు. ఎలాంటి అధి­కా­రాలు కూడా లేకుండా కలె­క్టర్, సీసీ­ఎల్ఏలు పని చేశా­ర­న్నారు. భూ భారతి చట్టంలో తాసి­ల్దార్ మొదలుకొని.. కలె­క్టర్ వరకు సమ­స్య­లను పరి­శీ­లించి, పరి­ష్క­రించే అధి­కా­రాలు ఉన్నా­యని చెప్పారు. ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఎంత సమ­ర్థ­వం­తంగా అమలు చేస్తే ప్రజ­లకు అంత మేరకు సత్వర న్యాయం జరు­గుతుందని సునీల్ తెలి­పారు.