విధాత: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చలాన్ల స్కాంలో మరో ముగ్గురు సబ్రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు పడింది.కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ వి. వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంతో పాటు కడప సబ్రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. ఇప్పటివరకు చలాన్ల స్కాంలో 9 మంది సబ్రిజిస్ట్రార్లపై వేటు పడింది.సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్తో పలు చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.