ఏపీలో ఇంధన సంక్షోభం.. డీజిల్ కోసం కాళ్లు పట్టుకున్న ఆక్వా రైతు!

డీజిల్ కోసం బంక్ నిర్వాహకులను కాళ్లు పట్టుకుని బతిమిలాడిన ఏపీ ఆక్వా రైతు దీన గాథ..ఏపీలో ఇంధన సంక్షోభానికి నిదర్శనంగా కనిపిస్తుంది. వడ్డీలకు డబ్బులు తెచ్చి రొయ్యలు పెంచుతున్నానని, చెరువులో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోతుందని...మీ కాళ్లు పట్టుకుంటా.. డీజిల్ ఇప్పించండయ్యా అని రొదిస్తున్న రైతు దుస్థితి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అమరావతి : పెట్రోల్,డీజిల్ కొరత సమస్య తీవ్రతతో ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంక్ ల వద్ద వాహనదారులు పెట్రోల్, డీజిల్ ల కోసం రోజంతా పడిగాపులు పడుతున్న దృశ్యాలు సాధారణంగా మారిపోయాయి. ఓ వైపు ఇంధన కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించి జనాన్ని ఇబ్బందిపెడితే కఠన చర్యలుంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నప్పటికి.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

డీజిల్ కోసం కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడిన  ఆక్వా రైతన్న

రొయ్యల చెరువులో ఫ్యాన్ సీట్లు తిరుగాలంటే డీజిల్ ఇంజన్లు నడువాల్సి ఉందని..వడ్డీలకు డబ్బులు తెచ్చి రొయ్యలు పెంచుతున్నానని, చెరువులో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే నా రొయ్య పిల్ల చచ్చిపోతుందని…మీ కాళ్లు పట్టుకుంటా.. డీజిల్ ఇప్పించండయ్యా అని రొదిస్తున్న రైతు దుస్థితి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డీజిల్ కోసం బంక్ నిర్వాహకులను, బందోబస్తు కోసం వచ్చిన పోలీసులను  కాళ్లు పట్టుకుని బతిమిలాడిన ఆక్వా రైతు దీన గాథ..ఏపీలో ఇంధన సంక్షోభానికి నిదర్శనంగా కనిపిస్తుంది. రోజంతా నీళ్లు, భోజనం లేకుండా డీజిల్ కోసం బంకు వద్ద పడిగాపులు పడుతున్నామని ఆ రైతు వాపోయాడు.

వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్

కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ సైతం వైరల్ గా మారింది. రూ.500 డీజిల్ కోసం రైతు రోదించిన తీరు చూసి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? చంద్రబాబుది గుండెనా లేక బండనా? అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వెళ్ళగక్కారు.

3వేల బంకుల్లో నో స్టాక్ బోర్డులా..?

ఇది రైతన్నను రక్షించే ప్రభుత్వమా ? భక్షించే ప్రభుత్వమా ? ఇదేనా చంద్రబాబు విజీనరీ? దీన్నే అంటారా అద్భుతమైన గుడ్ గవర్నెన్స్ ? రైతులతో కాళ్లు పట్టించుకున్న పాపం ఈ కూటమి ప్రభుత్వానికి తగలకపోదు అని షర్మిల శాపనార్థాలు పెట్టారు. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చింది ? ఎన్డీఏ పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్లయుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా ? ఎప్పుడైన జరిగిందా అంటూ విమర్శించారు.

సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో నో స్టాక్బోర్డులు ఇవ్వాళ్టికి ఎందుకున్నాయి ? ఇదేనా రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ? ఇందుకేనా పడి పడి మోదీజీకి మద్దతు ఇచ్చేది ? బంకుల దగ్గర జనాలు అవస్థలు పడుతుంటే, ప్రత్యక్షంగా అన్నీ రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి, మోదీ తొత్తుగా ఉండటానికి చంద్రబాబు సిగ్గుపడాలి అని షర్మిల విమర్శిచారు. రాష్ట్రంపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనం. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు .. ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు అంటూ షర్మిల డిమాండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి :

అంతపెద్ద పాము..భయపడిపోయిన కూలీలు!
బిర్యానీ తర్వాత పుచ్చకాయ తిన్నారు.. అంతే.. కుటుంబం మొత్తం చనిపోయారు!

Latest News