ఆంద్రప్రదేశ్: ప్రిన్సిపల్ సెక్రటరీతో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం
విధాత: జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని వారు కోరారు. అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. కాగా సీఎంవో అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని అంతా సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ […]

విధాత: జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పీఆర్సీ నివేదికను వెంటనే బయటపెట్టాలని వారు కోరారు. అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్ షిప్ వివరాలు కూడా కోరామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.
కాగా సీఎంవో అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని అంతా సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని శశిభూషణ్ స్పష్టం చేశారు.
మేం మా దారి తప్పం.. కలిసి రావాలని వెంకట్రామిరెడ్డిని కోరుతు న్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోందంటే మాకు అనుమనాలు వస్తున్నాయి. ప్రభుత్వమే చంద్రశేఖర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చింది. బొప్పరాజు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.
పీఆర్సీ నివేదికను మేమూ స్టడీ చేయాలి,మా డిమాండ్లు ఆ నివేదికలో ఉందో లేదో మాకూ తెలియాలి కదా..?పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..? లేదా..? రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తామన్నారు.
వెంకట్రామిరెడ్డి కూడా మా సోదరుడే.. ఉద్యోగుల కోసమే మా ప్రయత్నం. పెద్ద జేఏసీలుగా ఉన్న మేం ఏకమై పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నాం కాబట్టి.. పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తు న్నారు. ఎవరేం విమర్శలు చేసినా మేం పట్టించుకో. పీఆర్సీ వ్యవహరాన్ని ఏదో లబ్దిని ఆశించే పక్కదారి పట్టించేలా వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు.