విధాత: గుంటూరు ఏటీ అగ్రహారంలో జరిగిన ఒక సంఘటనను నారాలోకేష్ రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని పోలీస్ అసోసియేషన్ వారు వెల్లడించారు.జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా అత్యాచార ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు.
డ్రామాను మరిపించే విధంగా లోకేష్ విధానం ఉంది పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు.తను చేసిన అవాస్తవ ఆరోపణలను వెనక్కు తీసుకోవాలన్నారు.
ఆరోపణలు వచ్చిన కానిస్టేబుల్ ను తక్షణమే సస్పెండ్ చేయడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది.రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు వ్యవస్థ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది పోలీసు వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని వారు పేర్కొన్నారు.