రాంకీ ఫార్మా కేసులో నన్ను తొల‌గించండి: అయోధ్యరామిరెడ్డి

విధాత‌:ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది.జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మా ఛార్జ్​షీట్ నుంచి తనను తొలగించాలన్న డిశ్చార్జ్ పిటిషన్​పై వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వాదనలు వినిపించారు.అయోధ్య రామిరెడ్డి తరఫున మరిన్ని వాదనల కోసం విచారణను ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. సీబీఐ, రాంకీ ఫార్మా కేసులో అభియోగాలపై ఆయోధ్యరామిరెడ్డి వాదనలు వినిపించగా కీ ఫార్మా, వాన్‌పిక్‌, దాల్మియా సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల […]

  • Publish Date - August 4, 2021 / 04:27 AM IST

విధాత‌:ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది.జగన్ అక్రమాస్తుల కేసులో రాంకీ ఫార్మా ఛార్జ్​షీట్ నుంచి తనను తొలగించాలన్న డిశ్చార్జ్ పిటిషన్​పై వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వాదనలు వినిపించారు.అయోధ్య రామిరెడ్డి తరఫున మరిన్ని వాదనల కోసం విచారణను ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. సీబీఐ, రాంకీ ఫార్మా కేసులో అభియోగాలపై ఆయోధ్యరామిరెడ్డి వాదనలు వినిపించగా కీ ఫార్మా, వాన్‌పిక్‌, దాల్మియా సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల 12కి వాయిదా పడింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు తెలిపింది. అలాగే లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది.