మరో తొమ్మి రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రం జరుగబోతుందని, ఈ ఎన్నికలు మీ ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని మీ బిడ్డ జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలంటే..పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు
హిందూపురం సభలో ఏపీ సీఎం జగన్
విధాత : మరో తొమ్మి రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రం జరుగబోతుందని, ఈ ఎన్నికలు మీ ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని మీ బిడ్డ జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలంటే..పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. శనివారం హిందూపురం వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు వేస్తే కొండచిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లేనన్నారు. మీ బిడ్డ జగన్ ప్రభుత్వం 59నెలల విప్లవాత్మక పాలనలో ఒక్క బటన్ నొక్కడం ద్వారా మీకు 2లక్షల 70వేల కోట్ల రూపాయల పథకాలను ఇంటింటికి నేరుగా అందించామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచించాలన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకు రాదని, ఈ ఐదేళ్లలో 2లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మేం మ్యానిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీల అమలు చేశామన్నారు.
చంద్రబాబుకు ఎన్నికల అప్పుడు మాత్రమే మ్యానిఫెస్టో గుర్తుకు వస్తుందని, ఆ తర్వాతా దానిని చెత్తబుట్టలో పడేయడం అలవాటన్నారు. మాకు మ్యానిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబిల్ వంటిదని, ప్రజలకు ఇచ్చిన మాట..భరోసా అని దానిని నిలబెట్టుకునే వాడే నాయకుడన్నారు. మీ బిడ్డ పాలనలోని మత్స్యకార భరోసా, వాహన మిత్ర, లానేస్తం, గతంలో ఎప్పుడైనా వచ్చాయా అని, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో ఎప్పుడైనా కనిపించాయా అని ప్రశ్నించారు. ఏ గ్రామానికి వెళ్ళిన గ్రామ సచివాలయం కనిపిస్తుందని, రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పని చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్లో టాప్స్ కనిపిస్తున్నాయని పేర్కోన్నారు. ఇంటింటికి 3000 పెన్షన్ గతంలో వచ్చిందా అని ప్రశ్నించారు.
అందుకే మీ బిడ్డ పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి మరోసారి వైసీపీని గెలిపించాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతందన్నారు. భూమి సంపూర్ణ హక్కులు కల్పించడమే దీని ఉద్ధేశమన్నారు. భూములపై ఏ వివాదాలు వచ్చిన ప్రభుత్వమే గ్యారంటిగా ఉంటుందని, ప్రతిపక్షాలు దీనిపై రాజకీయ కోణంలో లేనిపోని దుష్ప్రచారాలు చేస్తు ప్రజలకు నష్టం చేస్తున్నాయని ఆరోపించారు. మీ బిడ్డగా నేను భూములిచ్చేవాడినే తప్ప తీసుకునే వాడిని కాదన్నారు. అసలు చంద్రబాబుకు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు.