ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లో వేసిన పిటిషన్ పై విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును ఈ నెల14కు వాయిదా వేసింది.
సీబీఐ కోర్టును కోరిన ఏపీ సీఎం జగన్
అనుమతి ఇవ్వవద్దన్న సీబీఐ
ఇరువైపులా వాదనలు విన్న కోర్టు
తీర్పు ఈనెల 14కువాయిదా
విధాతః ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లో వేసిన పిటిషన్ పై విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును ఈ నెల14కు వాయిదా వేసింది. 2024 మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తరువాత లండన్ లో ఉన్న తన కూతుళ్లను కలువడానికి 17వ తేదీన తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేశారు. అయితే సీబీ ఐ జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వ వద్దని కౌంటర్ దాఖలు చేసింది.
ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని ఈ సమయం లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని సీబీఐ తరపు న్యాయవాధి వాదించారు. ప్రతి కేసులో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడని కోర్టుకు సీబీ ఐ తెలిపింది. అలాగే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.
దీంతో జగన్ తరపు న్యాయవాధి కల్పించుకొని గతంలో అనేక సార్లు విదేశాలకు వెళ్లాడని ఎక్కడ కూడ కోర్టు నిబంధనలు ఉల్లంగించ లేదని కోర్టు కు తెలిపారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దాన్ని కలరాయడం సరైంది కాదనని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మేరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాధి కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీ ఐ కోర్టు న్యాయమూర్తి తీర్పును ఈ నెల14 కు వాయిదా వేసింది.